Big Breaking: AP DSC పరీక్షలు వాయిదా. .. ఎందుకంటే

Big Breaking: AP DSC  పరీక్షలు వాయిదా. .. ఎందుకంటే

ఆంధ్రప్రదేశ్​ లో ఈ నెల 20,21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి.జులై 1,2 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహిస్తామని డీఎస్సీ కన్వీనర్​ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.  

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఇంటర్నేషనల్​ యోగా ను ఘనంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది.  జూన్​ 21న విశాఖలో జరిగే యోగా కార్యక్రమానికి ప్రధాని మోదీ రానున్నారు.  సాగర తీరంలో సుమారు 5 లక్షల మందితో యోగాసనాలు వేయించేందుకు చర్యలు చేపట్టారు.

ఏపీ ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తలపెట్టడంతో అధికారులందరూ ఆ కార్యక్రమంలో ఉంటారు. . ట్రాన్స్‌పోర్ట్ కూడా తక్కువ అందుబాటులో ఉంటుంది. అలాంటి సందర్భంలో పరీక్షలు పెడితే అభ్యర్థులు ఇబ్బంది పడతారని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. .  

యోగా డే సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని వారి రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ఈ పరీక్షల తేదీలు మార్చినట్లు  తెలిపారు. ఈ అభ్యర్థులకు జులై 1, 2 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని, దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాలు, పరీక్ష తేదీలు మార్చిన హాల్ టిక్కెట్లు AP MEGA DSC-2025  website: https://apdsc.apcfss.in లో 25 వ తేదీనుంచి అందుబాటులో ఉంచుతామని కన్వీనర్​ ఎంవీ కృష్ణారెడ్డి  పేర్కొన్నారు. అభ్యర్ధులు మార్చిన హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొని దాని ప్రకారం పరీక్షలకు హాజరు కావాలని తెలిపారు.