
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 20,21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి.జులై 1,2 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహిస్తామని డీఎస్సీ కన్వీనర్ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ యోగా ను ఘనంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. జూన్ 21న విశాఖలో జరిగే యోగా కార్యక్రమానికి ప్రధాని మోదీ రానున్నారు. సాగర తీరంలో సుమారు 5 లక్షల మందితో యోగాసనాలు వేయించేందుకు చర్యలు చేపట్టారు.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తలపెట్టడంతో అధికారులందరూ ఆ కార్యక్రమంలో ఉంటారు. . ట్రాన్స్పోర్ట్ కూడా తక్కువ అందుబాటులో ఉంటుంది. అలాంటి సందర్భంలో పరీక్షలు పెడితే అభ్యర్థులు ఇబ్బంది పడతారని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. .
యోగా డే సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని వారి రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ఈ పరీక్షల తేదీలు మార్చినట్లు తెలిపారు. ఈ అభ్యర్థులకు జులై 1, 2 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని, దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాలు, పరీక్ష తేదీలు మార్చిన హాల్ టిక్కెట్లు AP MEGA DSC-2025 website: https://apdsc.apcfss.in లో 25 వ తేదీనుంచి అందుబాటులో ఉంచుతామని కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. అభ్యర్ధులు మార్చిన హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకొని దాని ప్రకారం పరీక్షలకు హాజరు కావాలని తెలిపారు.