పాపికొండల టూర్కు ఏపీ సర్కార్​ గ్రీన్ ​సిగ్నల్​​

పాపికొండల టూర్కు ఏపీ సర్కార్​ గ్రీన్ ​సిగ్నల్​​
  • ట్రయల్ రన్ ​సక్సెస్​ కావడంతో ఏపీ సర్కార్​ గ్రీన్ ​సిగ్నల్​​
  • భద్రాచలంలో ఓపెన్​ అయిన టికెట్​ కౌంటర్లు 
  • పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750  

భద్రాచలం, వెలుగు : ఈ నెల 9వ తేదీ నుంచి గోదావరిలో లాంచీల్లో పాపికొండలను తిలకించేందుకు ఆంధ్రా సర్కారు అనుమతినిచ్చింది. ఈ మేరకు భద్రాచలంలో కూడా శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్న తర్వాత టూరిస్టులు పాపికొండల యాత్రకు వెళ్లేందుకు టికెట్​కౌంటర్లు తెరిచారు. సోమవారం విలీన ఆంధ్రాలోని వీఆర్​పురం మండలంలోని ఎస్సై, ఎంపీడీఓ, డీటీలు, లాంచీల యజమానులతో కలిసి ట్రయల్​ రన్​ నిర్వహించారు.

వీఆర్​పురం మండలం పోచవరం నుంచి పాపికొండలు దాటాక తెల్లదిబ్బలు, కొర్టూరు వరకు లాంచీలో వెళ్లి వాతావరణం, ఇతర పరిస్థితులను పరిశీలించారు. అంతా సవ్యంగానే ఉందని ఆఫీసర్లు గ్రీన్​సిగ్నల్​ ఇవ్వడంతో ఈనెల 9వ తేదీ నుంచి పాపికొండల యాత్ర షురూ చేయనున్నారు. మొత్తం 17 లాంచీలకు అనుమతినిచ్చారు. ఒక్కో లాంచీలో సామర్థ్యాన్ని బట్టి 72, 82, 90 మంది టూరిస్టులను ఎక్కించుకునేందుకు పర్మిషన్​ఇచ్చారు. పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 టిక్కెట్ ధర నిర్ణయించారు. పోచవరం నుంచి లాంచీ బయలుదేరి పాపికొండల్లోని కొర్టూరు వరకు వెళ్లి తిరిగి వస్తుంది. మధ్యలో పేరంటాలపల్లి ఆశ్రమం కూడా చూపిస్తారు. మార్గమధ్యలో టీ, టిఫిన్​, భోజనం ఏర్పాటు చేయనున్నారు.