రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి : రోడ్‌ షో సభలు, ర్యాలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరుల్లో చంద్రబాబు ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. మున్సిపల్‌, పంచాయతీ రహదారులు, రోడ్డు మార్జిన్ల వద్ద పోలీసు యాక్ట్‌ నిబంధనలను అమలు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో రోడ్డు షోలు నిర్వహించకుండా చూడాలని హోంశాఖ ఆదేశాల్లో  స్పష్టం చేసింది. 

ప్రజలకు ఇబ్బందిలేని విధంగా రోడ్డుకు దూరంగా సభలు, రోడ్డు షోలు నిర్వహించుకోవాలని హోం శాఖ సూచించింది. ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలు, ర్యాలీలు జరిగేలా చూడాలని స్పష్టం చేసింది. అత్యంత అరుదైన సందర్భాల్లోనే షరతులతో కూడిన అనుమతివ్వనున్నట్లు చెప్పింది.