AP: పిల్లల్లో న్యుమోనియా మరణాల నివారణకు వ్యాక్సిన్ డ్రైవ్

AP: పిల్లల్లో న్యుమోనియా మరణాల నివారణకు వ్యాక్సిన్ డ్రైవ్

అమరావతి: పిల్లల్లో న్యూమోనియా మరణాల నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించింది. తాడేపలిల్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైద్యాధికారులు నెలల చిన్నారికి న్యుమోకోకల్ కాంజుగేట్(పీసీవీ) వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 
చిన్నారులకు సంబంధించి ఏపీలో ఇప్పటి వరకు తొమ్మిది రకాల వ్యాక్సిన్లను ప్రభుత్వం అందిస్తుండగా తాజాగా ఇస్తున్న న్యుమోకోకల్ తో కలిపి వ్యాక్సిన్ల సంఖ్య 10రకాలకు చేరింది. ఈ కార్యక్రమంలో  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.