ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. తొమ్మిది మంది IAS అధికారుల బదిలీ

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. తొమ్మిది మంది IAS అధికారుల బదిలీ

ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి IAS లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇటీవలే సీనియర్ IAS అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధిపతులను మార్చిన సర్కార్ శనివారం ( సెప్టెంబర్ 20 ) మరో తొమ్మిది మంది IAS  లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

బదిలీ అయిన ఐఏఎస్ అధికారులు వీరే :

  • ఏపీ జెన్‌కో ఎండీగా నాగలక్ష్మీ
  • ఆర్ అండ్ బీ డైరెక్టర్‌గా ప్రశాంతి
  • ఎక్సైజ్‌ డైరెక్టర్‌గా శ్రీధర్‌
  • సీఆర్డీఏ అడిషనల్‌ కమిషనర్‌గా భార్గవ్‌
  • స్టాంప్స్‌ & రిజిస్ట్రేషన్స్‌ ఐజీగా అంబేద్కర్‌
  • కృష్ణా జిల్లా జేసీగా నవీన్‌
  • ఖాదీ గ్రామీణ పరిశ్రమల సీఈవోగా కట్టా సింహాచలం
  • నెల్లూరు జిల్లా జేసీగా వెంకటేశ్వర్లు
  • ఎస్‌ఈసీ కార్యదర్శిగా మల్లికార్జున్‌ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కూటమి ప్రబుత్వం.