రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఉదయలక్ష్మికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) అంశంలో కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేయడంతో ఈ వారెంట్ జారీ అయింది.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన రత్నకుమార్ అనే PET టీచర్ తనకు అన్యాయం చేశారంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రత్నకుమార్కు న్యాయం చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే గతంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్గా పనిచేసిన ఉదయలక్ష్మి హైకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించిన కోర్టు.. వచ్చే విచారణలో ఉదయలక్ష్మిని హాజరుపరచాలని గుంటూరు SPని ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని గతంలో విద్యాశాఖలో పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలపాటు వాయిదా వేసింది.