సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు జీవో రద్దు

సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు జీవో రద్దు

అమరావతి : సినిమా టికెట్ల ధరల తగ్గింపు విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవోను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. పాత విధానంలోనే టికెట్ రేట్లు నిర్ణయించుకునేందుకు పిటీషనర్లకు వెసలుబాటు కల్పించింది. సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ కొన్నాళ్ల క్రితం ఏపీ సర్కారు జీవో నెంబర్ 35 జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన థియేటర్ యజమానులు ప్రభుత్వం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా జీవో ఇచ్చిందని పిటీషన్ లో పేర్కొన్నారు. కొత్త సినిమాలు విడుదలైన సమయంలో టికెట్ ధర పెంచుకునే అధికారం థియేటర్ యజమానులకు ఉంటుందని వారి తరఫున సీనియర్ లాయర్లు ఆది నారాయణ రావు, దుర్గా ప్రసాద్ వాదనలు వినిపించారు. రేట్లు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని విన్నవించారు. పిటీషనర్ తరఫు లాయర్ల వాదనలతో ఏకీభించిన హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో ఏపీలో ఇకపై పాత టికెట్ రేట్లే అమలుకానున్నాయి.