నేడు ఏపీ ఇంటర్ రిజల్ట్స్

నేడు ఏపీ ఇంటర్ రిజల్ట్స్

ఇంటర్మీడియేట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలకు 10,17,600 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ఇంటర్మీడియేట్‌ బోర్డు కార్యదర్శి బి ఉదయలక్ష్మి విడుదల చేయనున్నారు. ఫలితాలు  jnanabhumi.ap.gov.in, results.apcfss.in, rtgs.ap.gov.in, www.manabadi.co.in, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.