బండి ఉండుంటే మాదే గవర్నమెంట్ : ఏపీ జితేందర్​రెడ్డి

బండి ఉండుంటే మాదే గవర్నమెంట్ : ఏపీ జితేందర్​రెడ్డి

మహబూబ్​నగర్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్​ ఉండుంటే, ఈ రోజు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్​రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తన ఇంట్లో బీజేపీ క్యాండిడేట్​ మిథున్​ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రజలే చెబుతున్నారని, కొందరు చెప్పిన మాటలతో సంజయ్​ని తప్పించారన్నారు.

ఆ తరువాత తెలంగాణలో కాంగ్రెస్​ గ్రాఫ్​ పెరిగిందని చెప్పారు. బీజేపీ రాకపోతే అల్టిమేట్​గా కాంగ్రెస్  పార్టీని ఎంచుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలంతా మార్పు కోరుకున్నారన్నారు. లక్ష కోట్లు అప్పుల్లో ఉన్న తెలంగాణలో కాంగ్రెస్  ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయడం సాధ్యం కాదన్నారు.