బీఆర్ఎస్లో చేరిన ఏపీ నేతలు

బీఆర్ఎస్లో  చేరిన ఏపీ నేతలు

ఏపీకి చెందిన పలువురు నేతలు ఇవాళ బీఆర్ఎస్లో  చేరారు. మాజీ మంత్రి  రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్  తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింత పార్థసారధి సహా పలువురు నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి కండువా కప్పి కేసీఆర్ పార్టీలోకి  అహ్వానించారు. 

రిటైర్డ్ ఐఏఎస్ అయిన తోట చంద్రశేఖర్ 2009లో ప్రజారాజ్యం  పార్టీలో చేరి గుంటూరు లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ నుంచి ఏలూరు ఎంపీగా  పోటీ చేసి ఓడిపోయారు. 2019 లో జనసేన అభ్యర్థిగా గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

మాజీమంత్రి అయిన రావెల కిశోర్ బాబు 2014 ఎన్నికల్లో గుంటూరులోని ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. 2019లో జనసేనలో చేరి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. చింతల పార్థసారథి 2019లో అనకాపల్లి ఎంపీగా  జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు.