ఏపీ మెడికల్ అడ్మిషన్ల గడువు నేటికి పెంపు

ఏపీ మెడికల్ అడ్మిషన్ల గడువు నేటికి పెంపు
  •   కాంపీటెంట్ అథారిటీ కోటాపై వర్సిటీ ప్రకటన 

హైదరాబాద్, వెలుగు : ఏపీ విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్​హెల్త్ సైన్సెస్ పరిధిలోని కాలేజీల్లో, తిరుపతిలోని శ్రీ పద్మావతి విమెన్స్ మెడికల్ కాలేజ్ లో 2023–24 విద్యా సంవత్సరానికి గాను ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కాంపీటెంట్ అథారిటీ కోటా కింద అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు గడువును గురువారం (ఈ నెల 27) సాయంత్రం 6 గంటల వరకూ పొడిగించారు.

అర్హులైన అభ్యర్థులు స్కాన్ చేసిన సర్టిఫికెట్లను ఆన్ లైన్ లో సబ్మిట్ చేయొచ్చని ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వేమిరెడ్డి రాధికా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అడ్మిషన్ల విషయంలో ఈ నెల 19న విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొన్న నిబంధనలన్నీ వర్తిస్తాయని తెలిపారు.