రోడ్డు ప్రమాదం.. పీఏ మృతి, ఎమ్మెల్సీకి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. పీఏ మృతి, ఎమ్మెల్సీకి తీవ్ర గాయాలు

తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. కారు టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీ వెనుక భాగాన్ని ఢీకొంది. ఈ ప్రమాద ఘటనలో చంద్రశేఖర్‌రెడ్డి పీఏ అక్కడికక్కడే మృతి చెందగా.. ఎమ్మెల్సీ తలకు తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక సమీపంలో గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు సమాచారం. విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.  సకాలంలో స్తానికులు స్పందించి క్షతగాత్రులను నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా, కొద్ది రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా మృతి చెందిన ఉపాధ్యాయ నియోజకవర్గాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.