జిన్నాటవర్‌కు జాతీయ జెండా రంగులు

జిన్నాటవర్‌కు జాతీయ జెండా రంగులు

గుంటూరు నగర నడిబొడ్డులో ఉన్న జిన్నాటవర్‌ను జాతీయ జెండా రంగులు అద్దారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఓ వర్గం కార్యకర్తలు జిన్నాటవర్‌పై జాతీయ జెండా ఎగురవేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.  దీంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిన్న మంగళవారం రూ.5 లక్షలు ఖర్చు చేసి దిమ్మెను ఏర్పాటు చేస్తున్నారు. జిన్నాటవర్‌కు జాతీయ జెండాలోని రంగులు వేశారు. జిన్నా టవర్ చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. రేపు గురువారం ఉదయం 11 గంటలకు జిన్నాటవర్‌ వద్ద జాతీయ జెండాను ఎగురవేసేందుకు పాలకవర్గంతో, అధికారులు సంసిద్ధమయ్యారు. 
ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ఆంగ్లేయులపై ముస్లిం లు ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. 
బ్రిటీష్ వారి నుంచి స్వాతంత్రం వచ్చాక దేశ విభజన సమయంలో దేశంలోని ముస్లింలలో కొంత మంది పాకిస్తాన్ కు వెళ్లిపోగా... మరికొంత మంది తమలాగే సొంతగడ్డపై మమకారంతో ఇక్కడే ఉండిపోయామని గుర్తు చేశారు.