ఏపీలో 477 కేసులు నమోదు

ఏపీలో 477 కేసులు నమోదు
  • 24,451 టెస్టులు
  • విదేశాలకు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 34

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 24,451 టెస్టులు చేయగా వారిలో 477 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారిలో 34 మంది విదేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వారిగా గుర్తించినట్లు అధికారులు హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేశారు. ఇప్పటి వరకు 106 మంది మరణించారు. 3354 మంది డిశ్చార్జ్‌కాగా.. 3599 మంది హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. కరోనా కారణంగా కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఒకరు చెప్పున చనిపోయారు.