ఏపీలో కొత్తగా 7,293 కేసులు..57 మంది మృతి

ఏపీలో కొత్తగా 7,293 కేసులు..57 మంది మృతి

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,293 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,68,751కు చేరింది. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా మరో 57  మంది చనిపోయారని చెప్పింది. శనివారం వరకు 5,97,294 మంది డిశ్చార్జ్‌ అయ్యారని..  ఇప్పటి వరకు కరోనా బారినపడి 5,663 మంది మరణించారని తెలిపింది. 24 గంటల్లో 9,125 మంది పూర్తిగా కోలుకున్నారని.. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 55,23,786 శాంపిల్స్‌ పరీక్షించారని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ.