- ఇప్పటి వరకు 933 మంది మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రెండు రోజుల నుంచి దాదాపు 9వేల కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో 8,147 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80858కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 993 మంది చనిపోయారు. 39,935 మంది వ్యాధి నుంచి కోలుకోగా.. 39,990 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 24 గంటల్లో 48,114 శ్యాంపిల్స్ను టెస్ట్ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 15,41,993 శ్యాంపిల్స్ను టెస్ట్ చేశారు. కరోనా కారణంగా తూర్పుగోదావరిలో 11 మంది, కృష్ణలో 9 మంది, కర్నూల్లో 8మంది, శ్రీకాకుళంలో 7గురు, పశ్చిమ గోదావరిలో ఐదుగురు, గుంటూరులో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, ప్రకాశం, విజయనగరంలో ఒక్కోరు చనిపోయారు.