ముంబైలో రోడ్డు ప్రమాదం..ఏపీ యువకుడి మృతి

ముంబైలో రోడ్డు ప్రమాదం..ఏపీ యువకుడి మృతి
  • ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ ధీరజ్ మృతి

ముంబయి: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. చనిపోయిన యువకుడు ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ధీరజ్ గా గుర్తించారు. నగరంలో ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చనిపోయాడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ముంబైకి వచ్చి పనిచేస్తున్నాడు. ధీరజ్ తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులే.  తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయిని, మేనమామ కాకి ప్రకాశరావు ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఉన్నత విద్యావంతుల కుటుంబంలో జన్మించి చిన్న వయసులోనే పెద్ద ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన ధీరజ్ అకాల మృతిపట్ల ఏపీకి చెందిన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.