గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : పి.వెంకటరాములు

గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : పి.వెంకటరాములు

లింగంపేట, వెలుగు : లింగంపల్లి ఖుర్దు గ్రామంలో ఉన్న ప్రభుత్వ మైనార్టీ గురుకుల బాలుర స్కూల్​లోని 5, 6, 7 క్లాసుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని  ప్రిన్సిపల్​ పి.వెంకటరాములు ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఫిబ్రవరి 6 వరకు ఆన్​లైన్​లో అప్లయ్​ చేసుకోవాలని సూచించారు.

5వ క్లాస్​లో 40 సీట్లు, 6,7 తరగతుల్లోని బ్యాక్​లాగ్ ​సీట్లను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాల కోసం సెల్​నెంబర్​7995057919కు సంప్రదించాలని సూచించారు.