రైల్వేలో అప్రెంటిస్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్

రైల్వేలో అప్రెంటిస్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్

సికింద్రాబాద్‌‌‌‌ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌‌‌‌సీఆర్‌‌‌‌) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌‌‌‌ ఖాళీల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. సౌత్​ సెంట్రల్​ రైల్వే లోని 35 ఎస్టాబ్లిష్‌‌‌‌మెంట్‌‌‌‌లలోని 11 ట్రేడ్ లలో  4,103 ఖాళీలున్నాయి. అప్లై చేయాలనుకునే అభ్యర్థులు పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులను టెన్త్‌‌‌‌, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారం గా సెలెక్ట్​ చేస్తారు.
మొత్తం ఖాళీలు: 4103
అప్రెంటిస్‌‌‌‌ వివరాలు: ఏసీ మెకానిక్‌‌‌‌– 250, కార్పెంటర్‌‌‌‌–18, డీజిల్‌‌‌‌ మెకానిక్‌‌‌‌–531, ఎలక్ట్రీషియన్‌‌‌‌–1019, ఎలక్ట్రానిక్‌‌‌‌ మెకానిక్‌‌‌‌–92, ఫిట్టర్‌‌‌‌–1460, మెషినిస్ట్‌‌‌‌–71, ఎంఎంటీఎం–5, ఎంఎండబ్ల్యూ–24, పెయింటర్‌‌‌‌–80, వెల్డర్‌‌‌‌–553 పోస్టులు ఉన్నాయి. 
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్‌‌‌‌ ఉండాలి. 
వయసు: 04.10.2021 నాటికి 15–24 ఏండ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
సెలెక్షన్​ప్రాసెస్​: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తులు: ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లై చేసుకోవాలి. 
చివరి తేది: 3 నవంబర్​
వెబ్​సైట్​: www.scr.indianrailways.gov.in