GHMC ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10తో ముగుస్తుందనీ… ఈలోపు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఉందని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. దీనిని అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తప్పక పాటించాలని ఎస్ఈసీ సూచించారు.
పోటీ చేసే అభ్యర్థులు GHMC లో ఓటరుగా నమోదై ఉండాలని..2016 ఎన్నికల్లో నిర్ణయించిన వార్డుల రిజర్వేషన్లే కొనసాగుతాయని పార్థసారథి స్పష్టం చేశారు.