ఐఎండబ్ల్యూఎఫ్ అధ్యక్షుడిగా వాసిరెడ్డి సీతారామయ్య నియామకం

ఐఎండబ్ల్యూఎఫ్ అధ్యక్షుడిగా వాసిరెడ్డి సీతారామయ్య నియామకం

కోల్​బెల్ట్, వెలుగు: ఇండియన్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్(ఏఐటీయూసీ అనుబంధ) నూతన అధ్యక్షుడిగా సింగరేణి కార్మిక నేత​వాసిరెడ్డి సీతారామయ్య ఎన్నికయ్యారు. జార్ఖండ్​రాజధాని రాంచీలో గురువారం జరిగిన ఫెడరేషన్(ఐఎండబ్ల్యూఎఫ్)​ కౌన్సిల్​సమావేశంలో అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.

ఈ ఫెడరేషన్​దేశంలోని 8 కోలిండియా బొగ్గు పరిశ్రమలతోపాటు సింగరేణి సంస్థలో యూనియన్​కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఏఐటీయూసీ సింగరేణి విభాగం స్టేట్ అధ్యక్షుడైన సీతారామయ్య ఐఎండబ్ల్యూఎఫ్ అధ్యక్షునిగా మూడేండ్లపాటు కొనసాగనున్నారు. ఆయన ఎన్నిక పట్ల ఏఐటీయూసీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.