కేటీఆర్, గోరటి గుర్తు తెలియని వ్యక్తులా?.. పోలీసుల ఎఫ్ఐఆర్​పై సీఈవోకు కాంగ్రెస్​ ఫిర్యాదు

కేటీఆర్, గోరటి గుర్తు తెలియని వ్యక్తులా?.. పోలీసుల ఎఫ్ఐఆర్​పై సీఈవోకు కాంగ్రెస్​ ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: బహిరంగంగా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అమరవీరుల స్థూపం వద్ద బహిరంగంగా ఇంటర్వ్యూ చేసినా, పోలీసులు ఎఫ్ఐఆర్​లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అని పేర్కొనడం దారుణమని కాంగ్రెస్​ మండిపడింది. దీనిపై గతంలో ఈసీకి ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్​లో అజ్ఞాత వ్యక్తుల ఇంటర్వ్యూ అని పేర్కొన్నారని ఆరోపించింది.

దీనిపై బుధవారం మరోసారి సీఈవో వికాస్​రాజ్​కు పార్టీ ఎన్నికల కోఆర్డినేషన్ ​కమిటీ చైర్మన్​ జి.నిరంజన్​ ఫిర్యాదు చేశారు. మోడల్ ​కోడ్ ​ఉందని తెలిసినా ప్రభుత్వ స్థలమైన అమరుల స్థూపంలో ఇంటర్వ్యూ చేశారని, పలు చానళ్లలో ప్రసారం కూడా అయిందని గుర్తు చేశారు.