హైదరాబాద్, వెలుగు: బహిరంగంగా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అమరవీరుల స్థూపం వద్ద బహిరంగంగా ఇంటర్వ్యూ చేసినా, పోలీసులు ఎఫ్ఐఆర్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అని పేర్కొనడం దారుణమని కాంగ్రెస్ మండిపడింది. దీనిపై గతంలో ఈసీకి ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్లో అజ్ఞాత వ్యక్తుల ఇంటర్వ్యూ అని పేర్కొన్నారని ఆరోపించింది.
దీనిపై బుధవారం మరోసారి సీఈవో వికాస్రాజ్కు పార్టీ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ జి.నిరంజన్ ఫిర్యాదు చేశారు. మోడల్ కోడ్ ఉందని తెలిసినా ప్రభుత్వ స్థలమైన అమరుల స్థూపంలో ఇంటర్వ్యూ చేశారని, పలు చానళ్లలో ప్రసారం కూడా అయిందని గుర్తు చేశారు.