
మాదాపూర్, వెలుగు : శేరిలింగంపల్లి సెగ్మెంట్లో మరోసారి గులాబీ జెండా ఎగరేస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి వివేకానందనగర్లోని తన ఇంటి నుంచి సెగ్మెంట్లోని డివిజన్లలో ఆయన భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. రేపు జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఆయన కోరారు.