
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పాల్వంచలోని కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో ఈనెల 24న జిల్లా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలు జరుగనున్నాయని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె. మహీధర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎనిమిదేండ్ల నుంచి 20ఏండ్ల వయసు లోపు వారికి పోటీలు ఉంటాయని పేర్కొన్నారు.
60,100,400 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, జావెలిన్ త్రో, స్టాండింగ్ బ్రాండ్తో పాటు పలు అంశాల్లో పోటీలు ఉంటాయని తెలిపారు. ప్రతిభ చూపిన వారిని ఆగస్టు 3న హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్, సీనియర్ అథ్లెటిక్స్, 7న జరిగే రాష్ట్ర స్థాయి సబ్జూనియర్చాంపియన్ షిప్ పోటీలకు పంపుతామని పేర్కొన్నారు. జిల్లాలోని అథ్లెట్లు 24న ఉదయం 8 గంటలకు కిన్నెరసానిలోని కోచ్ నాగేందర్కు రిపోర్టు చేయాలని తెలిపారు.