
- ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి
నందిపేట, వెలుగు : చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా రక్షించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు. శుక్రవారం ఉమ్మడి నందిపేట మండలంలో ఎమ్మెల్యే పర్యటించారు. కుద్వాన్పూర్ గ్రామంలో బీసీ హాస్టల్ భవన నిర్మాణానికి అనువైన ఐదు ఎకరాల స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అయిలాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించడంతోపాటు పలువురు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
అనంతరం నందిపేట ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. చెట్లు నాటడంతో పాటు వాటిని రక్షించాల్సిన భాద్యత మనదేనన్నారు. అనంతరం డొంకేశ్వర్ మండలం చిన్నయానం శివారులోని ఎస్ఆర్ఎస్పీ పరీవాహకాన్ని పారెస్ట్అధికారులతో కలిసి సందర్శించారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే ఎంపీడీవో శ్రీనివాస్, సంతోష్, బీజేపీ మండలాధ్యక్షుడు రాజు, ఫారెస్ట్అధికారులు పాల్గొన్నారు.