మంచు కింద ఆర్మీ జ‌వాను మృతదేహం ల‌భ్యం

మంచు కింద ఆర్మీ జ‌వాను మృతదేహం ల‌భ్యం

క‌శ్మీర్: ఎనిమిది నెలల కిందట గల్లంతైన ఓ జవాను ఇన్నాళ్ల తర్వాత నియంత్రణ రేఖ వద్ద మంచు కింద విగతజీవుడై కనిపించాడు. కశ్మీర్ గుల్మార్గ్ లో నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వరిస్తున్న రాజేంద్ర సింగ్ నేగి అనే ఈ జవాను జనవరి నుంచి ఆచూకీ లేకుండా పోయాడు. రాజేంద్ర సింగ్ ఆచూకీ లేకపోవడంతో అతడు మృతి చెందినట్టు భార్యకు ఆర్మీ అధికారులు లేఖ రాశారు. అయితే తన భర్త మృతదేహాన్ని చూసేంతవరకు తాను అతడి మృతిని నిర్ధారించుకోలేనని ఆమె సమాచారం అందించారు.

ఈ క్ర‌మంలో, భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం తనిఖీలు చేపడుతుండగా, మంచు కింద రాజేంద్ర సింగ్ మృతదేహాన్ని చూశారు. మంచుతో పూర్తిగా గ‌డ్డ‌క‌ట్టుకు పోయిన రాజేంద్ర సింగ్ డెడ్ బాడీని చూసి చ‌లించి పోయామ‌ని తెలిపారు అధికారులు. దేశం కోసం ఎండ‌న‌కా, వాన‌న‌కా డ్యూటీ చేస్తూ మంచులోనే ప్రాణాలు వ‌దిలిన‌ట్లు తెలుస్తుంద‌న్నారు. పోస్టుమార్టం త‌ర్వాత పూర్తి వివ‌రాలు తెలుస్తాయ‌న్నారు. పోస్ట్ మాస్టం త‌ర్వాత‌‌ జవాను మృతదేహాన్ని అతడి స్వగ్రామానికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజేంద్ర సింగ్ స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ లోని చమోలి గ్రామం. రాజేంద్రసింగ్ 2001లో సైన్యంలో చేరాడు.