ముగిసిన వీర జవాన్ మహేశ్ అంత్యక్రియలు

ముగిసిన వీర జవాన్ మహేశ్ అంత్యక్రియలు

భారత్ – పాకిస్థాన్ సరిహద్దులో ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో  వీరమరణం పొందిన నిజామాబాద్ జిల్లాకు  చెందిన జవాన్ ర్యాడ మహేశ్ అంత్యక్రియలు ముగిశాయి. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగియి. మహేశ్ పార్ధివదేహాంపై జాతీయ జెండాను ఉంచిన అధికారులు…ఆ తర్వాత నివాళులర్పించారు. వీరమరణం పొందిన జవాన్ మహేశ్ కు చివరి సారిగా నివాళులర్పించారు కుటుంబ సభ్యులు, నేతలు. బీజేపీ ఎంపీ అర్వింద్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాడె మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.