కాలువలో ప్రమాదవశాత్తు పడి కొట్టుకుపోతున్న ఓ మహిళను ఆర్మీ జవాన్ కాపాడారు. ఈ సంఘటన పంజాబ్లో జరిగింది. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని పాటీయాలా సమీపంలోని భాక్రా కాలువ నిత్యం ఉద్ధృతం గా ప్రవహిస్తూ ఉంటుంది. కాలువ చూడటానికి వచ్చిన టూరిస్ట్లో ఓ మహిళ కాలు జారి ప్రమాదవశాత్తు పడిపోయింది. గమనించిన స్థానికులు అరవడం మొదలుపెట్టారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆర్మీ జవాన్ డీఎన్ క్రిష్ణన్అప్రమత్తమైకాలువలో దూకారు. ఆమెను కాపాడటానికి ప్రయత్నించారు.
కానీ ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సాధ్యం కాలేదు. వెంటనే స్థానికులు వారిని కాపాడేందుకు తాళ్లు విసిరారు. వాటి సాయంతో జవాన్ మహిళను ఒడ్డుకు చేర్చారు. ఈ దృశ్యాలను ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. జవాన్ సాహసాన్ని మెచ్చుకుంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. జవాన్ ధైర్య సాహసాలను చూసి స్థానికులు, పోలీసులు మెచ్చుకుంటున్నారు. అన్ని వేళలా అప్రమత్తంగా ఉంటూ ప్రజలను నిత్యం కాపాడేవారే జవాన్లని ప్రశంసిస్తున్నారు.