అల్లూరిని కళ్లకు కట్టేలా

 అల్లూరిని కళ్లకు కట్టేలా
  • నృత్య ప్రదర్శనతో అదరగొట్టిన కళాకారులు

బషీర్​బాగ్, వెలుగు: మన్యం వీరుడు అల్లూరి  సీతారామరాజు దేశభక్తిని నృత్యరూపంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. గురువారం రవీంద్రభారతిలో భరతనాట్య గురువు పద్మశ్రీ డాక్టర్ ఆనంద్ శంకర్ జయంత్ దర్శకత్వంలో ఈ ప్రదర్శన ఇచ్చారు. -అల్లూరి దేశభక్తిని చాటే సన్నివేశాలను ప్రదర్శించారు. 23 మంది కళాకారులతో మార్షల్ ఆర్ట్స్ ఫైటింగ్​సన్నివేశాలతో రక్తి కట్టించారు.

అలాగే మినిస్టర్ ఆఫ్ కల్చర్, ఒడిశా డాన్స్ అకాడమీ(భువనేశ్వర్) ఆధ్వర్యంలో పద్మశ్రీ అరుణ మొహంతి, ఆనంద శంకర్​ జయంత్​  దర్శకత్వంలో ‘రసభైవా’ శీర్షికతో ఒడిశా కళాకారులు భరతనాట్యంతో అలరించారు. భగవద్గీత తత్వశాస్త్ర ప్రాముఖ్యాన్ని చూపించారు. అతిథులుగా సికా డాక్టర్​ చక్రవర్తి, జి.అన్నారావు హాజరయ్యారు.