సీబీఐ విచారణకు హాజరైన సీఎం అరవింద్ కేజ్రీవాల్

సీబీఐ విచారణకు హాజరైన సీఎం అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ విచారణకు  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ఆరెస్ట్ అయిన నిందుతులతో కేజ్రీవాల్ ను అధికారులు ప్రశ్నించనున్నారు. కేజ్రీవాల్  సీబీఐ విచారణ క్రమంలో ఆప్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో సీబీఐ కార్యాలయంతో పాటుగా ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. సీబీఐ విచారణకు హాజరయ్యేముందు కేజ్రీవాల్ రాజ్ ఘూట్ లోని  గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఇక ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ  సీఎం మనిష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్  జైల్లో ఉన్నారు.