హైదరాబాద్, వెలుగు: తమ వేతనాన్ని రూ.18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ కోఠిలోని హెల్త్ డైరెక్టరేట్ వద్ద ఆశావర్కర్లు సోమవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆశాలు హాజరయ్యారు.
18 వేల ఫిక్స్డ్ సాలరీ, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, హెల్త్ కార్డులు,ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రతకు హామీ ఇవ్వాలని ఆశాలు డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం డీఎంఈ రమేశ్రెడ్డికి వినతిపత్రం అందజేశారు.