కలెక్టరేట్​ ఎదుట ఆశా వర్కర్ల నిరసన

కలెక్టరేట్​ ఎదుట ఆశా వర్కర్ల నిరసన

సంగారెడ్డి టౌన్, వెలుగు : ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు నిర్ణయించాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అంతుకుముందు సంగారెడ్డి లోని కేవల్​ కిషన్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ 18 ఏళ్లుగా ప్రభుత్వానికి సేవ చేస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వడం లేదన్నారు. అనంతరం వినతిపత్రాన్ని డీఆర్ఓ, డీఎంహెచ్ ఓలకు అందజేశారు.