
గుమి (సౌత్ కొరియా): ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ చివరి రోజు కూడా ఇండియా అథ్లెట్లు పతకాల మోత మోగించారు. మూడు రజతాలు, మూడు కాంస్యాలతో మెరిశారు. శనివారం జరిగిన విమెన్స్ 4X400 మీటర్ల రిలేలో తెలంగాణ అమ్మాయి గంధె నిత్య, అభినయ రాజరాజన్, స్నేహ, -శ్రబని నందతో కూడిన ఇండియా 43.86 సెకన్ల (సీజన్ బెస్ట్) టైమింగ్తో రజతం నెగ్గింది. విమెన్స్ 5 వేల మీటర్ల రేసులో పారుల్ చౌదది 15ని:15.33 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో ప్లేస్లో సిల్వర్ సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో ఆమెకు ఇది రెండో మెడల్. జావెలిన్ త్రోయర్ సచిన్ యాదవ్ ఈటెను 85.16 మీటర్ల దూరం విసిరి రజతం దక్కించుకున్నాడు. ఇది అతని పర్సనల్ బెస్ట్. స్టార్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ ఈవెంట్కు దూరంగా ఉన్నాడు.
ఇండియాకే చెందిన యశ్వీర్ సింగ్ 82.57 మీటర్ల దూరంతో ఐదో ప్లేస్లో నిలిచాడు. మెన్స్ 200 మీటర్ల రేసులో స్ప్రింటర్ అనిమేశ్ కుజుర్ 20.32 సెకన్లలో లక్ష్యాన్ని చేరి బ్రాంజ్ మెడల్ సాధించాడు. విమెన్స్ 200 మీటర్ల రేసులో ఏపీ అథ్లెట్ యెర్రాజీ జ్యోతి (23.47 సె), నిత్య (23.90 సె) వరుసగా ఐదు, ఏడో ప్లేస్కు పరిమితమయ్యారు. విమెన్స్ 800 మీటర్ల రేసులో మిడిల్ డిస్టెన్స్ రన్నర్ పూజా 2ని:01.89 సెకన్ల టైమింగ్లో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకోగా, విమెన్స్ 400 మీటర్ల హర్డిల్స్లో విత్య రామ్రాజ్ 56.46 సెకన్లతో కాంస్యంతో సంతృప్తి పడింది. గత ఎడిషన్లో 27 పతకాలు సాధించిన ఇండియా ఈసారి 24 (8 గోల్డ్, 10 సిల్వర్, 6 బ్రాంజ్) పతకాలు అందుకుంది.