స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దీపికా పల్లికల్‌, హరీందర్‌ పాల్‌ సంధుకు స్వర్ణం

స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దీపికా పల్లికల్‌, హరీందర్‌ పాల్‌ సంధుకు స్వర్ణం

ఆసియా క్రీడల్లో భారత్ హవా కొనసాగుతోంది. పతకాల వేటలో దూసుకుపోతోంది. ఇవాళ రెండు గోల్డ్ మెడల్స్ ను తన ఖాతాలో వేసుకుంది భారత్. స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దీపికా పల్లికల్‌, హరీందర్‌ పాల్‌ సంధు ఫైనల్‌లో 2--0తో మలేషియా జోడీ బీబీపై విజయం సాధించి స్వర్ణం సాధించారు.ఈ ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు 20 బంగారు పతకాలను సాధించింది. 

ALSO READ | వరల్డ్కప్ మ్యాచ్ల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం : డీఎస్‌ చౌహాన్‌

ఆసియా క్రీడల్లో భారత్ పతాకల పట్టికలో 82 పతకాలతో  నాలుగో స్థానంలో కొనసాగుతుంది.  చైనా 316 పతకాలతో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. జపాన్‌ 147 మెడల్స్‌తో  రెండో స్థానంలో రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా 148 పతకాలతో  మూడో స్థానంలో ఉన్నాయి.