
ఆసియా క్రీడల్లో భారత్ హవా కొనసాగుతోంది. పతకాల వేటలో దూసుకుపోతోంది. ఇవాళ రెండు గోల్డ్ మెడల్స్ ను తన ఖాతాలో వేసుకుంది భారత్. స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్లో దీపికా పల్లికల్, హరీందర్ పాల్ సంధు ఫైనల్లో 2--0తో మలేషియా జోడీ బీబీపై విజయం సాధించి స్వర్ణం సాధించారు.ఈ ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు 20 బంగారు పతకాలను సాధించింది.
ALSO READ | వరల్డ్కప్ మ్యాచ్ల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం : డీఎస్ చౌహాన్
ఆసియా క్రీడల్లో భారత్ పతాకల పట్టికలో 82 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. చైనా 316 పతకాలతో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. జపాన్ 147 మెడల్స్తో రెండో స్థానంలో రిపబ్లిక్ ఆఫ్ కొరియా 148 పతకాలతో మూడో స్థానంలో ఉన్నాయి.