ఇందిరమ్మ ఇండ్ల పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఇందిరమ్మ ఇండ్ల పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను స్పీడప్ చేయాలని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. సోమవారం కెరమెరి మండలం కొటాఠి గ్రామంలో  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాకు కేటాయించిన ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో సకాలంలో నిధులు జమ అయ్యేలా పర్యవేక్షించాలన్నారు. 

అనంతరం సావర్ ఖేడా గ్రామంలో ప్రధానమంత్రి శ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్​ను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న బోధన తీరును పరిశీలించారు. మెనూ ప్రకారం, తాజా కూరగాయలు, నాణ్యమైన సరుకులతో పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు.

ఒలింపిక్ డే రన్

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో  జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒలింపిక్ డే రన్ ర్యాలీని జండా ఊపి ప్రారంభించారు. క్రీడల ద్వారా క్రమశిక్షణతో పాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని, చదువులో ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. 

రైతులకు ధీమా రైతు భరోసా

రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తోందని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈసారి వర్షాలు ముందుగా రావడంతో రైతులు 70 శాతం పత్తి పంట సాగు చేస్తున్నారని, రైతు భరోసా నిధులతో విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. పెట్టుబడి సాయం కింద జిల్లాలో సోమవారం నాటికి 15 ఎకరాల వరకు 1,31,287 మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.240.60 కోట్లు జమ చేశామన్నారు.