భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఆస్పిరేషనల్ జిల్లాల అభివృద్ధి ప్రోగ్రాంలలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన జిల్లాలకు రూ.30 కోట్ల వరకు ప్రోత్సాహక నిధులు అందజేయనున్నట్టు మినిస్టరీ ఆఫ్ పవర్ అడిషనల్ సెక్రెటరీ డాక్టర్ సాయిబాబు పేర్కొన్నారు. ఆస్పిరేషనల్ జిల్లా, బ్లాక్ల అభివృద్ధిపై కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఆస్పిరేషన్ జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా డేటా ఆధారితంగా ఉండాలన్నారు.

