గౌహతి : మంచంమీద నోట్ల కట్టలు పరుచుకుని నిద్రిస్తున్న అస్సాంకు చెందిన పొలిటీషియన్ ఫొటో సోషల్ మీడియాలో బుధవారం వైరల్ అయింది. అస్సాంలోని ఉదల్గిరి జిల్లా భైరగురిలో విలేజ్ కౌన్సిల్ డెవలప్మెంట్ చైర్మన్గా ఉన్న బెంజమిన్ బసుమతరీపై ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలున్నాయి.
తాజాగా ఆయన రూ.500 నోట్లను పరిచిన బెడ్మీద పడుకుని, ఒంటిమీద కూడా కొన్ని నోట్లు చల్లుకుని పడుకున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈయన అవినీతి వ్యతిరేక పార్టీగా పేరుగాంచిన యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్కు చెందిన నేత కావడంతో ప్రతిపక్షాల నుంచి విపరీతంగా విమర్శలు వస్తున్నాయి.
దీంతో ఆ పార్టీ వివరణ ఇచ్చుకుంది. ఈ పెద్దమనిషిని క్రమశిక్షణా చర్యల కింద గత జనవరిలోనే పార్టీ నుంచి తొలగించామని, అందుకు సంబంధించిన ఎవిడెన్సులను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అనంతరం ఫిబ్రవరి 10వ తేదీనే ఆయనను చైర్మన్ పదవి నుంచి కూడా ప్రభుత్వం తొలగించిందని గుర్తు చేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న అతని ఫొటోతోగానీ, ఆయనతోగానీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.