
- కేంద్రానికి లేఖ రాసిన అస్సాం సీఎం
గౌహతి: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ను మే 18 నుంచి మరో రెండు వారాల పాటు పొడిగించాలని అస్సాం ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేంద్రం విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ మే 17 తో ముగియనుంది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసినట్లు సీఎం సర్బానంద సోనోవాల్ శుక్రవారం మీడియాతో చెప్పారు. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉందని, ఇలాంటి సందర్భంలో మరింత కాలం లాక్ డౌన్ కొనసాగించడమే బెటర్ అని ఆయన అన్నారు. పొడిగింపుపై ఇప్పటికే తమ వైఖరిని కేంద్రానికి తెలియజేశామని, నాలుగో దశ లాక్డౌన్ లో తమకు కావలసిన సడలింపులపైనా అభిప్రాయాలను తెలియజేశామని చెప్పారు. ‘‘అన్ని రాష్ట్రాలు శుక్రవారం నాటికి కేంద్రానికి లేఖ రాశాయి. కేంద్ర ప్రభుత్వం పొడిగింపునకే మొగ్గు చూపతుంది”అని సీఎం అన్నారు.