
హైదరాబాద్ వెలుగు: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్నది. ఈ నెల 28 సాయంత్రం 5 గంటల వరకే క్యాంపెయినింగ్కు అనుమతి ఉన్నది. సోమ, మంగళవారం మాత్రమే మిగిలి ఉండటంతో.. పొలిటికల్ పార్టీలు, అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు. వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారు. దీంతో పల్లెలు, పట్నాలు జెండాలు, నినాదాలతో హోరెత్తుతున్నాయి.
ప్రధానంగా కాస్త వీక్గా ఉన్నామనుకునే ప్రాంతాల్లో ఎక్కువ సమయం కేటాయించేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇదే సమయంలో పోల్ మేనేజ్మెంట్పై పార్టీలు, క్యాండిడేట్లు ఫోకస్ పెట్టారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు తాయిలాల పంపిణీని కొందరు షురూ జేశారు.