అసెంబ్లీ ఎన్నికలు : ఓటేసేందుకు తరలివచ్చిన సినీ తారలు

అసెంబ్లీ ఎన్నికలు : ఓటేసేందుకు తరలివచ్చిన సినీ తారలు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో టాలీవుడ్ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండలోని పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లలో నిల్చొని ఓటేశారు. మిగతా వారు కూడా ఓటింగ్​లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, కీరవాణి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  దర్శకుడు శేఖర్ కమ్ముల తల్లి, కుమార్తెతో కలిసి పద్మారావునగర్​లో ఓటు వేశారు.

రాజమౌళి ఆయన సతీమణి రమ, నితిన్, సుమంత్, మంచు మనోజ్, రవితేజ, గోపిచంద్, సాయి ధరమ్ తేజ్, రామ్ పోతినేని, రానా ఓటు వేశారు. చందానగర్​లోని సరస్వతి విద్యా మందిర్​లో నటుడు  ప్రియదర్శి ఓటు వేశారు. నానక్​రాంగూడలోని ప్రభుత్వ పాఠశాలలో నటుడు మురళిమోహన్, నరేశ్​, గచ్చిబౌలిలోని ప్రభుత్వ స్కూల్​లో నాని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.