ఈటల రాజీనామాను ఆమోదించిన స్పీకర్

ఈటల రాజీనామాను ఆమోదించిన స్పీకర్

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయబడిన ఈటల.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించి శనివారం ఆయన.. స్పీకర్‌ను కలిసి స్పీకర్ ఫార్మట్‌లో తన రాజీనామాను సమర్పించారు. ఆ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు. ఉదయం రాజీనామా ఇచ్చిన వెంటనే మధ్యాహ్నం ఆమోదించడం గమనార్హం. ఈటల రాజేందర్ ఆరుసార్లు హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మరో రెండు రోజుల్లో బీజేపీలో చేరనున్నారు.