ఆర్య వైశ్యులు రాజకీయాల్లో రాణించాలి : గడ్డం ప్రసాద్​కుమార్​

ఆర్య వైశ్యులు రాజకీయాల్లో రాణించాలి : గడ్డం ప్రసాద్​కుమార్​
  •  అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​ 

కొడంగల్​,వెలుగు :  ఆర్య వైశ్యులు రాజకీయాల్లో రాణించాలని అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​ ఆకాంక్షించారు. ఆదివారం కొడంగల్​లో నిర్వహించిన వికారాబాద్​ జిల్లా నూతన కార్యవర్గ సమావేశానికి ఆయన చీఫ్ ​గెస్ట్​గా హాజరై మాట్లాడారు. ​ ప్రజా సేవలో ముందుండే ఆర్య వైశ్యులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వికారాబాద్​ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన శివకుమార్​ గుప్తను అభినందించారు.

కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్​రెడ్డి, కొడంగల్ కాంగ్రెస్​ ఇన్‌‌‌‌చార్జి తిరుపతిరెడ్డి, మున్సిపల్ ​చైర్మన్లు జగదీశ్వర్​రెడ్డి, స్వప్న పెరుమాళ్, మంజుల రమేశ్​, ఎంపీపీ ముద్దప్ప, నేతలు ప్రశాంత్​, బాలేశ్వర్​గుప్త తదితరులు పాల్గొన్నారు.