డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్

 డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్

రిక్రూట్‌‌మెంట్‌‌లో భాగంగా మొదట ఐడీబీఐ... మణిపాల్‌‌ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్‌‌ నోయిడా) విద్యా సంస్థలతో కలిసి ఏడాది(9 నెలలు క్లాస్‌‌ రూం+3 నెలలు ఇంటర్న్‌‌షిప్) వ్యవధి గల పోస్ట్‌‌ గ్రాడ్యుయేట్‌‌ డిప్లొమా ఇన్‌‌ బ్యాంకింగ్‌‌ అండ్‌‌ ఫైనాన్స్‌‌(పీజీడీబీఎఫ్)లో ట్రైనింగ్​ ఇస్తారు. విజయవంతంగా పూర్తిచేసిన వారికి అసిస్టెంట్‌‌ మేనేజర్‌‌ ఉద్యోగంలో జాయిన్​ అవుతారు.
 

మొత్తం ఖాళీలు: 650
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌‌ ఉత్తీర్ణత.
వయసు: 2021 జూలై 01 నాటికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్‌‌లైన్‌‌ టెస్ట్‌‌, పర్సనల్‌‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.
ఎగ్జామ్​ ప్యాటర్న్​: పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. నెగెటివ్‌‌ మార్కింగ్‌‌ ఉంటుంది. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే 0.25 చొప్పున మార్కు తీసివేస్తారు. 
ట్రైనింగ్​ ఫీజు: ఎంపికైన అభ్యర్థులను ఏడాది పోస్ట్​ గ్రాడ్యుయేషన్​ డిప్లొమా ఇన్​ బ్యాంకింగ్​ అండ్​ ఫైనాన్స్​ కోర్సులో చేరుస్తారు. అభ్యర్థులు కోర్సు ఫీజు కింద రూ.3,50,000 చెల్లించాలి. కోర్సులో చేరేటప్పుడు మూడేళ్లు సర్వీస్​ బాండ్​ సమర్పించాలి. 
దరఖాస్తులు: ఆన్‌‌లైన్‌‌లో అప్లై చేసుకోవాలి.
చివరి తేదీ: 22 ఆగస్టు
ఎగ్జామ్​: 4 సెప్టెంబర్​
తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్​ సెంటర్స్​:  హైదరాబాద్‌‌, విజయవాడ, విశాఖపట్నం
వెబ్‌‌సైట్‌‌: www.idbibank.in