అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మరో నోటిఫికేషన్

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మరో నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: కొత్తగా రిక్రూటైన అసిస్టెంట్ ప్రొఫెసర్ల జాయినింగ్ గడువు బుధ వారంతో ముగిసింది. 1,069 మంది ఉద్యోగాలకు ఎంపికవగా, 806 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. అయితే, ఇది గతంలో కంటే చాలా బెటర్ అని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌‌‌‌రెడ్డి తెలిపారు. గతంలో సగం మంది కూడా జాయిన్ అయ్యేవారు కాదన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ ప్రకారం ఉండాల్సిన సంఖ్య కంటే ఎక్కువ మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారని, కాలేజీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన తెలి పారు. 

ప్రస్తుతం మిగిలిన పోస్టులకు, కొత్తగా ఏర్పాటయ్యే కాలేజీల్లో అవసరమయ్యే పోస్టులను జతచేసి మరో 3 నెలల్లో మరోసారి నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. కొత్త, పాత మెడికల్ కాలేజీల్లో కలిపి 1,442 పోస్టులకు మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌మెంట్ బోర్డు కిందటేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో నోటిఫికేషన్ ఇవ్వగా1,069 మంది మాత్రమే ఉద్యోగాలకు అర్హత సాధించారు. వీళ్లందరికీ గత నెల 22న మంత్రి హరీశ్‌‌‌‌రావు అపాయింట్‌‌‌‌మెంట్​ లెటర్స్ అందజేశారు.