‘వీసా’ కామెంట్లను  తిప్పికొట్టిన ఇండియా

‘వీసా’ కామెంట్లను  తిప్పికొట్టిన ఇండియా
  • ఎంఎంపీ అగ్రిమెంట్​లో మాకిచ్చిన హామీలు అమలు చేయాలె
  • యూకేకు ఇండియన్ హైకమిషన్​ కౌంటర్​
  • ‘వీసా’ కామెంట్లను  తిప్పికొట్టిన ఇండియా

లండన్​: మైగ్రేషన్​ అండ్​  మొబిలిటీ పార్టనర్​షిప్ (ఎంఎంపీ) అగ్రిమెంట్​ సరిగ్గా అమలు కావడం లేదని, వీసా గడువు ముగిసినా యూకేలో ఉంటున్నోళ్లలో ఎక్కువమంది ఇండియన్లేనంటూ ఆ దేశ హోంశాఖ కార్యదర్శి సువెల్లా బ్రేవర్మన్​ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్​పై స్పందిస్తూ.. యూకేలోని భారత​ హైకమిషన్​ గట్టి కౌంటర్​ ఇచ్చింది. నిరుడు లండన్​  గవర్నమెంట్​తో చేసుకున్న ఎంఎంపీ ఒప్పందంలో భాగంగా, అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేసింది. లండన్​ ప్రభుత్వం నుంచే స్పందనలేదని తేల్చి చెప్పింది. వీసా గడువు ముగిసి యూకేలో ఉంటున్న ఇండియన్​ సిటిజన్స్​ను తిరిగి స్వదేశానికి పంపించే విషయమై, కలిసి పనిచేసేందుకు రెడీగా ఉన్నామని తెలిపింది.

హోంశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం అన్ని అంశాలపై చర్యలు ప్రారంభించినట్టు చెప్పింది. మైగ్రేషన్​ అండ్​ మొబిలిటీ ప్రొటోకాల్​ అగ్రిమెంట్​లో భాగంగా ఇండియాకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు యూకే గవర్నమెంట్​ చర్యలు తీసుకుంటున్నదని, అయితే అందులో పురోగతి కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది. ఇండియాతో ఫ్రీ ట్రేడ్​ అగ్రిమెంట్​(ఎఫ్​టీఏ) కూడా ఆందోళనకరంగా ఉందంటూ సువెల్లా కామెంట్​ చేశారు. దీనిపై కూడా భారత్​ హైకమిషన్​ స్పందించింది. ఎంఎంపీ అగ్రిమెంట్​పై చర్చలు కొనసాగుతున్నాయని, అలాంటప్పుడు ఎఫ్​టీఏ గురించి మాట్లాడటం సరికాదని జవాబిచ్చింది. ఎఫ్​టీఏ అగ్రిమెంట్​ రెండు దేశాలకు ప్రయోజనకరంగానే ఉంటుందని ఇండియన్​ హైకమిషన్​ భరోసా ఇచ్చింది.