కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ పై దాడికి యత్నం

కంటోన్మెంట్ ఎమ్మెల్యే  శ్రీగణేశ్ పై దాడికి యత్నం
  • బోనాల ఉత్సవాలకు వెళ్తుండగా అడ్డగించిన 30 మంది
  • గన్‌మెన్ల వద్ద గన్స్​లాక్కొనేందుకు ప్రయత్నం
  • కారు అద్దాలు దింపాలని గొడవ.. గన్‌మెన్ల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
  • ఓయూ పోలీస్​స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
  • శ్రీగణేశ్​​కు ఫోన్​చేసి.. వివరాలు ఆరా తీసిన సీఎం రేవంత్

ఓయూ, వెలుగు: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్​పై కొందరు దుండగులు దాడికి యత్నించారు. మాణికేశ్వర్​నగర్​లో బోనాల వేడుకలకు వెళ్తుండగా ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా 30 మంది యువకులు అడ్డగించారు.  ఎమ్మెల్యేపై దాడికి యత్నించగా, గన్‌మెన్లు అడ్డుకున్నారు.  దీనిపై ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే కంప్లయింట్​ చేశారు. ఈస్ట్​జోన్​ డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ నర్సయ్య ఓయూ పోలీస్ స్టేషన్ కు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. 

డీసీపీ బాలస్వామి కథనం ప్రకారం.. 10 బైక్‌‌లపై30 మంది గుర్తు తెలియని వ్యక్తులు ట్రిపుల్​రైడింగ్​ చేస్తూ ఎమ్మెల్యే వాహనానికి అడ్డుగా వచ్చారు. దీంతో ఎమ్మెల్యే డ్రైవర్ హారన్ కొట్టడంతో వారు తమ బండ్లను రోడ్డుపై అడ్డంగా నిలిపి.. తిరగబడ్డారు. కారు అద్దాలు దింపాలని గొడవ చేశారు. ఎమ్మెల్యే శ్రీగణేశ్​పై దాడికి యత్నించారు. గన్‌‌మెన్లు కిందకు దిగగానే వారి వద్ద ఉన్న గన్స్​ లాక్కునేందుకు యత్నించారు. గన్‌‌మెన్స్ ​వారిని తోసేయగా.. వెహికల్స్​పై విద్యానగర్ వైపు వెళ్లిపోయారు. 

దీంతో ఎమ్మెల్యే ఓయూ పీఎస్‌‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తనపై ముందస్తు ప్లాన్​ ప్రకారం ఆ యువకులు దాడి చేసేందుకు వచ్చారని కంప్లయింట్​లో పేర్కొన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.  కాగా, ఎమ్మెల్యే శ్రీ గణేశ్​పై అటాక్​ చేసేందుకు వచ్చిన వ్యక్తులు  ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, ఇందుకోసం మూడు స్పెషల్​ టీమ్స్​ను ఏర్పాటు చేసినట్టు డీసీపీ తెలిపారు.  ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే శ్రీగణేశ్​పై దాడికి యత్నం జరిగిందని తెలుసుకున్న సీఎం రేవంత్​రెడ్డి వెంటనే స్పందించారు. శ్రీ గణేశ్​కు ఫోన్​ చేసి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.