రాజస్థాన్‌లో తెలంగాణ పోలీసులపై స్థానికుల తీవ్ర దాడి

రాజస్థాన్‌లో తెలంగాణ పోలీసులపై స్థానికుల తీవ్ర దాడి

ఓ కేసు ఇన్వెస్టిగేషన్ కు రాజస్థాన్ కు వెళ్లిన తెలంగాణ పోలీసులు తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నారు. పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

వరంగల్ జిల్లా సుబేదారి పోలీసులు… ఓ దొంగతనం కేసు దర్యాప్తు కోసం రాజస్థాన్ వెళ్లారు. భీల్ వాడా జిల్లా బరాతియా గ్రామంలో దొంగల ఆచూకీ తెల్సుకుని.. పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఐతే.. స్థానికులు అనూహ్యంగా స్పందించారు. తెలంగాణ పోలీసులైన ASI శివకుమార్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లను పట్టుకుని చితకబాదారు. ఈ దాడిలో ASI శివకుమార్ తలకు గాయమైంది. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా గాయపడ్డారు. వీరిని రాజస్థాన్ లోని భీల్ వాడా జిల్లా రామ్ సనేహి హాస్పిటల్ లో చేర్పించారు అక్కడి పోలీసులు. ఈ ముగ్గురు ప్రస్తుతం ICUలో ఉన్నట్టు తెలిపారు.

కొంతమంది స్థానికులపై హత్యాయత్నం కింద రాజస్థాన్ పోలీసులు కేసు పెట్టారు. కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.