ఓ కేసులో విచారణ కోసం వెళ్లిన పోలీసులపై దాడి

ఓ కేసులో విచారణ కోసం వెళ్లిన పోలీసులపై దాడి

మేడ్చల్ జిల్లా శామీర్ పేటలో ఇటీవల జరిగిన వైన్ షాప్ దోపిడి కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో విచారణ కోసం వెళ్ళిన పోలీసులపై తండావాసులు దాడికి పాల్పడ్డారు. దీంతో బొమ్మల రామారం మండలం గద్దరాళ్ల తండాలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ దోపిడీ ఘటనలో అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని విచారించేందుకు తండాకు వెళ్ళిన శామీర్ పేట ఎస్సై మునీందర్, మేడ్చల్ ఎస్సై సత్యనారాయణ, అల్వాల్ డీఐ కిరణ్, సీసీఎస్ కు గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా పోలీసులు రావడంతో గుమికూడిన తండావాసులు.. పోలీసులపై దాడికి తెగబడినట్లు సమాచారం. అనంతరం దాడిలో గాయపడ్డ పోలీసులను ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.