కామారెడ్డి జిల్లాలో ఇద్దరు వ్యక్తులు కృష్ణ జింకలను వేటాడారు. ఈ ఘటన బిచ్కుంద మండలం సిర్శముందర్, హస్గుల్ గ్రామాల శివారులో జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీర్కుర్ మండలం వీరాపుర్ దుబ్బకు చెందిన కడమంచి సాయిలు, కప్పరి పెద్ద రాములు జింకలను వేటాడి అమ్మేందుకు నిజామాబాద్ తీసుకుని వెళుతుండగా శుక్రవారం తెల్లవారుజామున వర్ని పోలీసులు పట్టుకున్నారు. నిందితులను పిట్లమ్ ఫారెస్ట్ రేంజ్ అధికారికి అప్పగించారు. ఫారెస్ట్ అధికారులు జింకలకు పోస్టుమార్టం పూర్తి చేసి నిందితులపై కేసు నమోదు చేశారు.
For More News..