వదలని వాన.. డ్రాతో గట్టెక్కిన ఆసీస్‌‌

వదలని వాన.. డ్రాతో గట్టెక్కిన ఆసీస్‌‌

మాంచెస్టర్‌‌: యాషెస్‌‌ సిరీస్‌‌ నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌‌ చేతిలో ఆస్ట్రేలియా ఓటమి తప్పించుకుంది. భారీ వర్షం కారణంగా ఐదో రోజు ఆదివారం ఆట పూర్తిగా రద్దవడంతో ఈ మ్యాచ్‌‌ డ్రా అయింది. దాంతో ఐదు టెస్టుల సిరీస్​ను ఆసీస్​ నిలబెట్టుకుంది . తొలి ఇన్నింగ్స్‌‌లో ఆసీస్‌‌ 317 రన్స్‌‌కే ఆలౌటవగా ఇంగ్లండ్‌‌ 592 స్కోరు చేసి భారీ లీడ్‌‌ దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్‌‌లో తడబడిన ఆసీస్‌‌  214/5 స్కోరుతో నాలుగో రోజు ఆటను ముగించింది.  అప్పటికి 61 రన్స్‌‌ వెనుకంజలో నిలిచింది. సిరీస్​లో ఆసీస్‌‌ 2–1తో లీడ్​లో ఉంది. ఐదో టెస్ట్​ ఈ నెల 27 నుంచి జరుగుతుంది.